News March 24, 2025

అమరావతి: న్యాయవాదులకు గుడ్ న్యూస్ 

image

న్యాయవాదుల డెత్ బెనిఫిట్‌ను ఆరు లక్షలకు పెంచుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం హైకోర్టులో జరిగిన కౌన్సిల్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ మొత్తం ఐదు లక్షల రూపాయలుగా ఉంది. అనారోగ్యానికి గురైన వారికి ఒకటిన్నర లక్ష ఇవ్వనున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ తీర్మానాలు అమల్లోకి వస్తాయి. ప్రమాదవశాత్తు మరణించిన వారికి పై మొత్తంతో సంబంధం లేకుండా మరో ఐదు లక్షలు ఇస్తారు.

Similar News

News November 6, 2025

GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్‌లైన్

image

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్‌లైన్ నంబర్‌ సంప్రదించాలని సూచించారు.

News November 6, 2025

GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

image

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్‌ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

News November 6, 2025

సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

image

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు.