News January 30, 2026
అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

AP: అమరావతి రైతుల సమస్యల పరిష్కారం దాదాపు కొలిక్కి వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. వారి ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ‘29,233 మందికి 69,421ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా 1914 మందికి 7273 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. డ్రైన్లు నిర్మించాక సర్వే రాళ్లు వేయాలని రైతులు కోరారు. వర్షాకాలం నాటికి ప్లాట్లలో పూర్తి సదుపాయాలు కల్పిస్తాం’ అని కమిటీ భేటీ అనంతరం చెప్పారు.
Similar News
News February 11, 2026
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.
News February 11, 2026
టారిఫ్లే అస్త్రంగా భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేశా: ట్రంప్

భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి అన్నారు. ఇరుదేశాలు దాదాపు అణు యుద్ధం దిశగా సాగాయని చెప్పుకొచ్చారు. టారిఫ్లను అస్త్రంగా వాడి ఘర్షణల్ని నివారించినట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వం వల్ల దాదాపు కోటి మందికి చావు తప్పిందని స్వయంగా పాక్ ప్రధాని చెప్పినట్లు తెలిపారు. ఇరు దేశాల ఘర్షణల్లో దాదాపు 10 విమానాలు కుప్పకూలినట్లు చెప్పారు. మనుషులు చనిపోవడం ఇష్టంలేకే యుద్ధాల్ని ఆపానన్నారు.
News February 11, 2026
స్కూల్లో కాల్పులు.. 9 మంది మృతి

కెనడాలోని స్కూల్లో దుండగుడి కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని సెకండరీ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుండగుడు చనిపోయాడని లోకల్ మీడియా తెలిపింది. కాల్పులు ఎవరు, ఎందుకు జరిపారు, బాధితులంతా విద్యార్థులేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.


