News March 30, 2024
అమరావతి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

అమరావతిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న పంప్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైందని అమరావతి పోలీసులు తెలిపారు. ఓ మగ శవం (35) నీటిపై తేలాడుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ బ్రహ్మం అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పసుపు రంగు చారలు ఉన్న టీ షర్ట్ ధరించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News October 25, 2025
నీటి పథకాలు సమర్థవంతంగా పనిచేయాలి : కలెక్టర్

నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి పథకం సమర్ధవంతంగా పని చేయాలని, సి.పి.డబ్ల్యూ నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు జిల్లా పరిషత్ కు పంపించాలని సూచించారు. స్లో సాండ్ ఫిల్టర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత మేరకు గుర్తించి అంచనాలు సమర్పించాలని ఆదేశించారు.
News October 25, 2025
తెనాలి అనగానే… ఆ పేరు చెప్పక తప్పదు

తెనాలి పట్టణం సాహిత్యం, సంగీతం, నాటకం, చిత్రకళ, శిల్పకళల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతిభావంతులైన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గౌరవాలు అందుకుంటున్నారు. ప్రతి వీధిలోనూ సృజనాత్మకత ప్రతిధ్వనిస్తుంటే, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తెనాలి పేరు వినగానే “కళా కాణాచి” అనిపించుకోవడం ఆనవాయితీ.
@నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం
News October 25, 2025
GNT: ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలిపే పండుగ

నాగులచవితి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం. ఈరోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు తొలగి కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఉంది. ఆడవారు ఉపవాసం ఉండి పాలు, పండ్లు, పువ్వులతో నాగదేవతను ఆరాధిస్తారు. రైతులు పంటల రక్షణ కోసం, గృహిణులు కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. ఇది ప్రకృతి, జీవజాలాల పట్ల కృతజ్ఞత తెలిపే పండుగగా భావిస్తారు.


