News April 6, 2025

అమరావతి: వేగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు  

image

ఏపీ మెడ్‌టెక్‌జోన్ ప్రాంగణంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇది మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా నిలుస్తోంది. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది రాష్ట్రానికి, దేశానికి సాంకేతిక వైద్య పరికరాల రంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Similar News

News April 7, 2025

అల్పపీడనం.. 3 రోజులు విస్తారంగా వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది రేపటి వరకు వాయవ్య దిశగా కదిలి ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. ఉత్తరాంధ్ర, ఉ.గో, కృష్ణా జిల్లాలపై ప్రభావం ఉండొచ్చంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరిగి నాలుగు రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

News April 7, 2025

లావేరు: ‘బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలి’

image

లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.  

News April 7, 2025

Xలోకి రీఎంట్రీ ఇచ్చిన సమంత

image

స్టార్ హీరోయిన్ సమంత ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లోనే యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎక్స్‌లో కూడా యాక్టివ్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. తాను నిర్మించిన ‘శుభం’ సినిమా విశేషాలను తెలుపుతూ పోస్ట్‌ చేశారు. కాగా సామ్‌కు ఇప్పటికే ఎక్స్‌లో 10.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

error: Content is protected !!