News November 7, 2024

అమలాపురంలో అమెరికా అధ్యక్షుల నాణేలు

image

అమలాపురంలో నాణేల సేకరణ కర్త పుత్స కృష్ణ కామేశ్వర్ ఇంట అమెరికా అధ్యక్షుల నాణేలు దర్శనమిచ్చాయి. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తులపై డాలర్ విలువైన నాణేలను అమెరికన్ మింట్లు 2007 నుంచి విడుదల చేస్తున్నాయి. 2007 నుంచి 2011వరకు ఈ నాణేలు పెద్ద సంఖ్యలో చెలామణి కోసం ముద్రించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రెసిడెంట్ డాలర్స్ అన్నింటిని సేకరించగా.. 2012 నుంచి 2017వరకు, సిరీస్‌లోని కొత్త నాణేలను ఆయన విడుదల చేశారు.

Similar News

News February 28, 2026

RJY: ట్రంప్ తీరుపై సీపీఐ నారాయణ ధ్వజం

image

అమెరికా విధానాలు, ట్రంప్ తీరు వల్ల దేశంలో వ్యవసాయం, చేనేత రంగాలు నాశనమవుతున్నాయని CPI నేత కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ట్రంప్‌‌నకు బానిసగా మారిందని మండిపడ్డారు. సామాన్యులను వదిలేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

News February 28, 2026

RJY కల్తీ పాలు ఘటన.. 15 మందికి చికిత్స

image

RJY కల్తీ పాలు ఘటనలో బాధితులైన 15 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. వీరిలో కిమ్స్ లో 8 మంది, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు, డెంటల్‌లో ఇద్దరు, RACC, రవి చైతన్య ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని వెల్లడించారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో వీరికి వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.

News February 28, 2026

కల్తీ పాలు బాధితులకు మంత్రి నిమ్మల భరోసా

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోగుల కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించి, అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలని సూచించారు.