News April 21, 2024
అమలాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నేపథ్యం ఇదే..
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కాగా ఆయన ప్రస్తుతం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పి.గన్నవరం అసెంబ్లీకి పోటీ చేశారు. 2014లో అమలాపురం అసెంబ్లీ, 2019లో అమలాపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో 1970 ఆగస్టులో జన్మించారు.
Similar News
News October 12, 2024
కాకినాడ జిల్లాలో రావణ దేవాలయాన్ని చూశారా..!
లంకాధిపతి రావణాసురుడి దేవాలయం మన కాకినాడ రూరల్ సాగర తీరాన ఉంది. దసరా వేళ పలు ప్రాంతాల్లో రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో రావణాసురుని పూజించటం మరో విశేషం. దీన్ని కుంభాభిషేకం గుడి అని కూడా పిలుస్తారు. ఆయన ఆది కుంభేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటారు.
News October 12, 2024
రాజమండ్రి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల
రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
News October 11, 2024
రాజమండ్రి: ప్రజలకు దశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంట అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ దసరా వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.