News March 4, 2026

అమలాపురం: నిద్రమత్తు వదిలిస్తున్న పోలీసులు

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహించారు. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హైవేలపై వాహనాలను నిలిపి డ్రైవర్ల ముఖాలు కడిగించి, వారికి అవగాహన కల్పించారు. అర్ధరాత్రి వేళల్లో ప్రయాణించే డ్రైవర్ల అప్రమత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News March 6, 2026

రేపు సీతంపేట ఐటీడీఏలో జిల్లా కలెక్టర్ పర్యటన

image

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి శనివారం సీతంపేట ఐటీడీఏలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ గార్డెన్, ఇప్పకూడ గ్రామంలో ముస్తాబు కార్యక్రమం, జగతపల్లి వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో పాయింట్‌ను కలెక్టర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఐటీడీఏ సిబ్బంది పేర్కొన్నారు.

News March 6, 2026

22ఏ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించండి: కలెక్టర్

image

జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో 229 విజ్ఞప్తులు వచ్చాయని వాటిలో 18 మాత్రమే పరిష్కరించడం జరిగిందని,10 కేసులు రిజెక్ట్ అయ్యాయన్నారు. 2249 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయవలసి ఉండగా, 2184 పంపిణీ చేశారన్నారు.

News March 6, 2026

ఇరాన్‌పై దాడి.. మోదీకి ముందే చెప్పారా?

image

ఇరాన్‌పై దాడులకు కొన్ని రోజుల ముందే పీఎం మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహు దాడి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. అయితే దాంట్లో నిజం లేదని భారత్‌లోని ఆ దేశ అంబాసిడర్ అజార్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే దాడి టైమింగ్ నిర్ణయించామని తెలిపారు. అందుకే మోదీకి ఈ విషయం ముందే తెలిసే ఆస్కారమే లేదని వివరించారు.