News March 23, 2025

అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం డిపో నుంచి ఏప్రిల్ 5న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణం పూర్తయిన తర్వాత భద్రాచలం నుంచి అమలాపురం రావడానికి మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు.

Similar News

News November 13, 2025

భారత్ సమ్మిట్‌.. ఆకర్షణీయంగా భద్రాద్రి ఉత్పత్తులు

image

HYD శిల్పకళా వేదికలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో భద్రాద్రి జిల్లా ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో గిరిజన, SHG మహిళలు, MSME యూనిట్లు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, పిండివంటలు, హస్తకళా వస్తువులకు విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఇప్పపువ్వు లడ్డూ, బర్ఫీ, టీ పొడి, పొంగర్ పచ్చళ్లు, కరక్కాయ పొడి ఆకర్షణగా నిలిచాయి.

News November 13, 2025

పదునెట్టాంబడి అంటే ఏంటి?

image

పదునెట్టాంబడి అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లు. ఈ మెట్లు మనిషి పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతాలు. జ్ఞాన సాధన చేసే అయ్యప్ప స్వాములు మాత్రమే వీటిని ఎక్కుతారు. వారికి ప్రత్యేకంగా పడిపూజ చేస్తారు. ఈ మెట్లు ఎక్కడం అనేది జ్ఞాన మార్గంలో సాగే ఆధ్యాత్మిక ప్రయాణానికి గుర్తుగా భావిస్తారు. ప్రతి మెట్టూ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తుంది. పరిశుద్ధమైన మనసుతోనే ఈ మెట్లెక్కాలి. <<-se>>#AyyappaMala<<>>

News November 13, 2025

ఆసిమ్ మునీర్‌కు విస్తృత అధికారాలు!

image

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ విస్తృత అధికారాలు పొందేందుకు రాజ్యాంగ సవరణకు ఆమోదముద్ర పడింది. ఇది అన్ని సైనిక శాఖలపై అతనికి అత్యున్నత అధికారాన్ని కల్పించడమే కాకుండా సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తుంది. కొత్త అధికారాలతో నియామకాలు, మధ్యంతర ప్రభుత్వాలపై నియంత్రణ కలిగి ఉండటమే కాకుండా చట్టపరమైన విచారణ నుంచి జీవితకాల రక్షణ పొందుతారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు, పలువురు జడ్జిలు ఖండించారు.