News February 8, 2025

అమలాపురం: బీ ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్

image

ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ శనివారం బీ ఫారం అందుకున్నారు. అమరావతిలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ల శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బీఫారం అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర సాంకేతిక సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు పార్టీ నేతలు కార్యక్రమాలు పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

ఆన్‌లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

News November 17, 2025

ఆన్‌లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

News November 17, 2025

ములుగు: డబ్బుల కోసం జరిగిన గొడవలోనే సమ్మయ్య హత్య

image

డబ్బుల కోసం జరిగిన గొడవలోనే సమ్మయ్య హత్యకు గురైనట్లు ములుగు సీఐ సురేశ్ తెలిపారు. ములుగు మండలం లాలాయిగూడెంలో ఎలక్ట్రిషన్ సమ్మయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. సీఐ తెలిపిన వివరాలు.. ఇదే గ్రామానికి చెందిన సల్లూరి పవిత్ర సమ్మయ్యకు డబ్బులు ఇవ్వాలి. ఈ విషయమై వచ్చిన అతడితో పవిత్ర, ఆమె తాత సాంబయ్య, మరో మహిళ అనసూయ గొడవ పడి చంపేశారు. మృతుడి సోదరుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.