News February 21, 2025

అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి: సీఐ వీరబాబు

image

పోరంకికి చెందిన వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. అమలాపురం టౌన్ సీఐ వీరబాబు వివరాల ప్రకారం.. ప్రేమ విఫలమైన డాక్టర్ యలమంచిలి వెంకట్‌ జైనేంద్రి ( 28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జైనేంద్రి కిమ్స్‌ హాస్పిటల్‌‌లో వైద్యుడిగా పనిచేశారు. వారం రోజుల నుంచి లాడ్జిలో ఉంటూ విపరీతంగా మద్యం త్రాగి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News December 17, 2025

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో కృష్ణా జిల్లాకే అగ్రస్థానం.!

image

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం దక్కించుకుంది. మంగళవారం వరకు జిల్లాలో 3,83,127 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు తెలిపారు. 49,132 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటికే 47,182 మంది రైతులకు రూ. 864.72 కోట్లు జమ చేశారు. మిగిలిన రైతులకు త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు వివరించారు.

News December 17, 2025

కృష్ణా: గొబ్బెమ్మల పూజలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి షురూ

image

ధనుర్మాసం ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు మంచును సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే ఆవు పేడతో సంప్రదాయ గొబ్బెమ్మలు తయారు చేసి, గృహాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో గొబ్బెమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.

News December 16, 2025

కృష్ణాజిల్లా TDP అధ్యక్షుడిగా గురుమూర్తి.?

image

TDP కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. తోట్లవల్లూరుకు చెందిన గురుమూర్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన TDPలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పదవులను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారు.