News April 16, 2025

అమల్లోకి భూభారతి చట్టం: హనుమకొండ కలెక్టర్ 

image

ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లాలోని తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Similar News

News September 13, 2025

సమన్వయంతో పని చేసి జిల్లాభివృద్ధికి దోహదపడాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లా అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాభివృద్ధికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జిల్లా అధికారులందరూ ఒక టీమ్‌గా పనిచేసి, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు లక్ష్యసాధనలో గడువుకు ముందే ప్రగతిని సాధించాలని స్పష్టం చేశారు.

News September 13, 2025

సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

image

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.

News September 13, 2025

పెద్దపల్లి: ‘చంద్రయ్య మరణం మున్సిపల్ కార్మికులకు తీరని లోటు’

image

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో శనివారం దివంగత పెద్దపల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు ఆరేపల్లి చంద్రయ్య సంతాప సభ నిర్వహించారు. కార్మికులు, యూనియన్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి హాజరయ్యారు. చంద్రయ్య ఆశయ సాధనకు మున్సిపల్ కార్మికులందరూ పట్టుదలతో కృషి చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.