News July 1, 2024
అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు: SP

తిరుపతి జిల్లాలో నేటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు. తన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. ప్రతి సిటిజన్ ఎక్కడ నుంచైనా, ఆన్లైన్లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. సంబంధిత కాపీని ప్రతి సిటిజన్కు ఇవ్వాలి. గతంలో 511 సెక్షన్లు ఉంటే ప్రస్తుతం 358 సెక్షన్లకు కుదించారు’ అని ఎస్పీ చెప్పారు.
Similar News
News November 3, 2025
మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్కు అప్పగించారు.
News November 3, 2025
చిత్తూరు: ఆధార్ అప్ డేట్ గడువు పెంపు

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్డేట్కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. విద్యార్థుల ఆధార్ అప్డేట్ను 6వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి చేయించాలని ఆమె ఆదేశించారు.
News November 3, 2025
నాన్న సారీ అంటూ యువకుడి ఆత్మహత్య

పెనుమూరు(M) విడిదిపల్లికి చెందిన డి.అరవింద్ (17) ప్రేమ విఫలమై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్టోబర్ 24 నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థినితో అరవింద్ విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. నచ్చిన అమ్మాయి దూరమైందని డిప్రెషన్కు గురైన అరవింద్ నాన్న సారీ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.


