News February 28, 2026
అమీన్పూర్: కోకాపేట్ శారదా పీఠం వద్ద ఉద్రిక్తత: హరీశ్ రావు

కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారదా పీఠం ఖాళీ చేయించేందుకు అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి హరీశ్ రావు అక్కడికి చేరుకుని ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. గతంలో కేటాయించిన భూమిని ఎందుకు లాక్కుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పటాన్చెరు బీఆర్ఎస్ నేతలు పీఠానికి సంఘీభావం తెలిపి, ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 6, 2026
విద్యార్థులు పెడదోవ పట్టకుండా అవగాహన కల్పించాలి: కృష్ణా కలెక్టర్

విద్యార్థులు పెడదోవ పట్టకుండా విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంచి, చెడుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి తన చాంబర్లో బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
News March 6, 2026
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా దినోత్సవ వేడుకలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. ఆ అధికారి స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులను సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.
News March 6, 2026
అమెరికా చేతిలో గల్ఫ్ దేశాలు బలి!

మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాల్లో అమెరికాకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. ఆయా దేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలు, ఆటంకాలు లేని చమురు సరఫరా కోసం అమెరికా ఈ స్థావరాలను నిర్మించింది. అయితే అవే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ముప్పుగా మారాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులకు తెగబడుతోంది. దీంతో అసలు యుద్ధంతో సంబంధం లేని సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్లకు నష్టం వాటిల్లుతోంది.


