News April 24, 2025

అమీన్పూర్: తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈవో

image

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల పాఠశాలలకు వేసవి సెలవులు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సెలవులలో ఎవరైనా పాఠశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అన్ని రకాల యజమాన్యాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.

Similar News

News April 24, 2025

బాపట్లలో రేపు ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్

image

ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ప్రతినెల మూడో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వెంకట మురళి గురువారం పేర్కొన్నారు. తమ సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలో దివ్యాంగులు, ఎస్టీలు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌కు రావచ్చన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎస్టీలు, దివ్యాంగులు గమనించాలని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News April 24, 2025

VKB: అనంతగిరి కొండలను పర్యాటకంగా అభివృద్ధి: స్పీకర్

image

అనంతగిరి కొండలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ అనంతగిరి కొండల్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. అనంతగిరి కొండలు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తాయని, పర్యాటకులకు అనుకూలంగా అనంతగిరి కొండలను అభివృద్ధిలో తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.

News April 24, 2025

శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. శుక్రవారం 17 మండలాల్లో(శ్రీకాకుళం 4,విజయనగరం 5, మన్యం 8) తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్నట్లు APSDMA వివరించింది. ఇవాళ నంద్యాల(D) దొర్నిపాడులో 43.8°C అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

error: Content is protected !!