News March 25, 2024
అమీర్పేట్లో అమ్మాయి కోసం యువకుల గొడవ

ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన అమీర్పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ వాసులు నితిన్, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వచ్చింది. ఇక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్ను పిలిపించి దాడి చేశాడు.
Similar News
News September 7, 2025
HYD: పదేళ్లు కాంగ్రెస్ను అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నా: మహేశ్ కుమార్

పదేళ్ల తర్వాత పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో ఉంచేందుకు శ్రమిస్తున్నానని MLC, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ HYDలో అన్నారు. KCRను గద్దె దించేందుకు ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేశామని, CM రేవంత్ రెడ్డికి,తనకు కెమెస్ట్రీ బాగా కుదిరిందన్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకీకృతమవుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు నడుపుతున్నామన్నారు.
News September 7, 2025
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: మేయర్

ప్రమాదవశాత్తు టస్కర్ కింద పడి మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. లిబర్టీలో విధులు నిర్వర్తిస్తూ రోడ్డును దాటుతోన్న క్రమంలో రేణుకను <<1763786>>టస్కర్ ఢీ<<>> కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు GHMC వర్గాల నుంచి సమాచారం.
News September 7, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్పై మాజీ మేయర్ కన్ను!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల సంఖ్య కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతోంది. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జూబ్లీహిల్స్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తాను కూడా టికెట్ ఆశిస్తున్నారని నేరుగా చెబుతున్నారు. తనకు ఇక్కడ మంచి పరిచయాలు ఉన్నాయని, మేయర్గా పనిచేసిన అనుభవం కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.