News March 17, 2025
అమెరికాలో ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ‘కౌలు చట్టాన్ని తీసుకురావాలి’

వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో కౌలు రైతుల రక్షణ, సంక్షేమం కోసం కౌలు చట్టాన్ని తీసుకురావాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు అడపాల వేమ నారాయణ పేర్కొన్నారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సంఘం ప్రతినిధులతో కలిసి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కౌలు చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
News March 17, 2025
ఫస్ట్ మ్యాచ్.. RCB తుది జట్టు ఇదేనా?

IPL-2025 కోసం అన్ని జట్లు రెడీ అవుతున్నాయి. మార్చి 22న జరిగే తొలి మ్యాచులో ఆర్సీబీ, కేకేఆర్ తలపడనున్నాయి. అందులో ఆర్సీబీ ప్లేయింగ్ -11 ఎలా ఉంటుందో ESPNcricinfo అంచనా వేసింది.
టీమ్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ (C), లివింగ్స్టోన్, జితేశ్ శర్మ, బెథెల్/టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, యశ్ దయాల్, హేజిల్వుడ్, సుయాశ్.
News March 17, 2025
పెద్దపల్లి: గురుకుల ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని BC గురుకులాల జిల్లా కో-ఆర్డినేటర్ మణి దీప్తి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మహాత్మ జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని BC బాలికల, బాలుర పాఠశాలల్లో 2025-26 వార్షిక విద్య 6-9తరగతులకు www.mgtbcadmissions.orgలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.