News October 18, 2025

అమెరికాలో మంచిర్యాలకు చెందిన తల్లి, కూతురు మృతి

image

మంచిర్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన తల్లి, కూతుర్లు అమెరికాలో మృతి చెందారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాత విగ్నేశ్ సతీమణి రమాదేవి(52), కుమార్తె తేజస్వి(32)ని అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం సమయంలో జరిగిన ప్రమాదంలో ఇరువురు మరణించినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 18, 2025

భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో బెస్ట్ అవార్డు

image

భద్రాచలం ఐటీడీఏకు జాతీయ స్థాయిలో ‘బెస్ట్ అవార్డు’ లభించింది. గ్రామాల అభివృద్ధిలో విశిష్ట సేవలను అందించినందుకు గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. విజన్ 2030లో భాగంగా 130 గిరిజన గ్రామాల అభివృద్ధి, ‘ఆది కర్మయోగి అభియాన్’ అమలులో ఐటీడీఏ అద్భుత పనితీరు చూపినందుకు ఈ గౌరవం దక్కిందని ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. ఈ అవార్డు రావడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

News October 18, 2025

గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

image

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్‌హౌస్‌లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.

News October 18, 2025

దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

ప్రజలంతా దీపావళి పండుగను సురక్షితంగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్యావరణహిత టపాసులు కాల్చడంతో వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 101కు కాల్ చేయాలని సూచించారు.