News May 28, 2024
అమెరికాలో యాక్సిడెంట్.. యాదగిరిగుట్ట యువతి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. యాదగిరిపల్లి కాలనీకి చెందిన కోటేశ్వర్రావు, బాలమణి దంపతుల కుమార్తె సౌమ్య(24) 2022లో అమెరికాకు వెళ్లి 4 నెలల క్రితం ఫోరిడాలోని అట్లాంటిక్ యూనివర్శిటీలో MS పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్న సౌమ్య ఆదివారం మార్కెట్కి వెళ్లి వస్తుండగా వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందింది.
Similar News
News September 29, 2024
పంచాయితీ ఓటర్లలో మహిళా ఓటర్లే అధికం
NLG:గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను జిల్లా అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 10,42,545 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 5,25,780 మంది, పురుషులు 5,16,713 మంది,థర్డ్ జెండర్ 52 మంది ఉన్నారు. కాగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 9,067 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 868 గ్రామపంచాయతీలో 7,482 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 856 పంచాయితీల్లో 7,393 వార్డుల ఓటర్ల జాబితాను ప్రకటించారు.
News September 29, 2024
కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంత్ రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ధరణి, ప్రజావాణి దరఖాస్తులు, వాల్డా చట్టంపై సమీక్షించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ విషయంలో పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, భువనగిరి ఆర్డీఓ అమరేందేర్, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
News September 28, 2024
మిర్యాలగూడలో రామ్నగర్ బన్నీ చిత్ర యూనిట్
బుల్లి తెర నటుడు ప్రభాకర్ తనయుడు నటించిన రామ్ నగర్ బన్నీ టీం మిర్యాలగూడలో సందడి చేసింది. పట్టణంలో ఓ కళాశాలలో మూవీకి సంబంధించిన ప్రోమో జరిగింది. ప్రభాకర్తో పాటు హీరోహీరోయిన్లు హాజరయ్యారు. నేటి యువతను ఆకర్షించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఆదరించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, యాజమాన్యం వారిని ఘనంగా సన్మానించారు.