News June 26, 2024

అమ్మల కోసం అమ్మ ప్రేమగా..!: రోజా

image

తాజా ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి రోజా తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బుధవారం గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ‘కడుపు నిండా బోజనం చేసిన నిండు తల్లులు కడుపునిండి దీవించి వెళ్తుంటే అందులోని సంతోషం ఇంకెక్కడ దొరుకుతుంది. అమ్మల కోసం అమ్మ ప్రేమగా’ అని ఆ ఫోటోలను రోజా ట్వీట్ చేశారు. కాగా ఆమె రెండోసారి గెలిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

Similar News

News September 15, 2025

రొంపిచర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్‌పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్‌పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 15, 2025

కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

image

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.

News September 15, 2025

చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.