News June 25, 2024

అమ్మవారి మాలధారణలో పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో దర్శమమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ MLAలకు ఆయన శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని సమస్యలపై ఆయన దూకుడు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ అవగాహన కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు.

Similar News

News September 28, 2024

రాజమండ్రి: చిరుత కనిపించలేదు: DFO

image

కడియం మండలం బుర్రిలంక పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు ఇంకా గుర్తించలేదని, పాదముద్రలు కూడా కనిపించలేదని జిల్లా అటవీ శాఖాధికారిని భరణి శనివారం తెలిపారు. దివాన్ చెరువు ప్రాంతంలో కూడా ఏ విధమైన సమాచారం లభించలేదన్నారు. బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉన్న నేపథ్యంలో చిరుత అటు వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రేపటి నుంచి ఆ ప్రాంతాల్లో గాలిస్తామన్నారు.

News September 28, 2024

తూ.గో.: పిడుగు పడతాయి జాగ్రత్త

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కోనసీమ, కాకినాడ రూరల్, తుని, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, అనపర్తి తదితర ప్రాంతాల్లోని ప్రజల సెల్‌ఫోన్లకు సందేశాలు పంపించారు.

News September 28, 2024

రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు మండపేట విద్యార్థులు

image

రాయవరం, కాకినాడలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ ఆటల పోటీల్లో మండపేటకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14, 17 విభాగాల్లో టెన్నికాయట్ లో బల్ల సత్యనారాయణ, కే.శివశంకర్ ప్రసాద్, ఖండవల్లి చైతన్యలు ఎంపికయ్యారు.