News February 9, 2025
అమ్మవారి సేవలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ శనివారం రాత్రి సతీసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏఈవో దేవరాజులు, ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News November 6, 2025
ఫూట్ బాల్ రాష్ట్ర స్థాయి విజేత ఉమ్మడి మెదక్

వికారాబాద్లో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్- 14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి ఫూట్ బాల్ పోటీలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన జట్లతో పోటీపడి విజేతగా నిలిచింది. విజయం సాధించిన బాలికల జట్టుకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
News November 6, 2025
రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీకి వరంగల్ వేదిక

వరంగల్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ నిర్వహించనున్నట్లు కార్యదర్శి కన్నా తెలిపారు. బాలబాలికల విభాగంలో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయని, విజేతలకు నగదు బహుమతులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.
News November 6, 2025
రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.


