News April 17, 2025

అమ్మాయి ఎర.. HYDలో చెత్త కల్చర్!

image

HYD పబ్బుల్లో గబ్బు కల్చర్‌ పెరుగుతోంది. యువతను ఆకర్షిస్తూ కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు. అమ్మాయిలను ఎరవేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒంటరిగా మందు తాగుదామని వస్తే యువతులతో కంపెనీ అని బిల్లులు గట్టిగానే వేస్తున్నారు. పోలీసులు చెక్ పెడుతున్నా.. ఈ తరహా ఘటనలు నగరంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక OYO హోటల్స్‌, కో-లివింగ్ కల్చర్‌ కూడా గ్రేటర్‌లో పుట్టగొడుగుల్లా విస్తరించడం గమనార్హం.

Similar News

News April 19, 2025

తిరుమల: దర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 58,519 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.27 కోట్ల ఆదాయం సమకూరింది.

News April 19, 2025

రామాపురం: మృతుడు TDP నాయకుడిగా గుర్తింపు

image

అన్నమయ్య జిల్లా రామాపురంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హసనాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన TDP నాయకుడు ఇరగంరెడ్డి(50) కడపలో బంధువుల పెళ్లికి బైకుపై బయల్దేరారు. రామాపురం పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొట్టడంతో చనిపోయారు. ఆయన మృతికి మంత్రి మండిపల్లి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మృతి TDPకి తీరని లోటని పేర్కొన్నారు.

News April 19, 2025

కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

image

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్‌ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!