News July 11, 2024
అమ్మా ఆకలేస్తుంది.. నాన్న నిద్రొస్తుంది లే.. చిన్నారుల కన్నీటి మాటలు

అమ్మా లే ఆకలేస్తుందమ్మా.. నాన్నా లే నిద్రిస్తుందిలే నాన్నా.. అంటూ చిన్నారులు <<1360251>>తల్లిదండ్రుల మృతదేహాల<<>> వద్ద అంటున్న మాటలు పలువురిని కంట తడి పెట్టించాయి. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన దంపతులు కరకపట్ల శేఖర్, సౌమ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం ఇంటికి వచ్చిన మృతదేహాల వద్ద లెమ్మంటూ చిన్నారులు శివాన్స్, బంటు మాటలు పలువురిని కన్నీరు పెట్టించాయి.
Similar News
News January 1, 2026
మెదక్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: కలెక్టర్

ప్రజలందరూ ఆనందంగా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని మెదక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News January 1, 2026
మెదక్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత మహాసభల కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. డిపో మేనేజర్ సురేఖ, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
News January 1, 2026
మెదక్ జిల్లాలో రూ.21.32 కోట్లు తాగేశారు

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మెదక్ జిల్లాలో రూ. 21.32 కోట్ల విలువైన మద్యం తాగేశారు. అవును డిసెంబర్ 30, 31న రెండు రోజుల్లో చిన్నఘనపూర్ ఐఎంఎల్ డీపో నుంచి వైన్స్ వ్యాపారులు కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.209 కోట్ల 50 లక్షలు మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లోనే రూ. 21 కోట్ల 32 లక్షల మద్యం లాగించేశారు.


