News February 26, 2025

అమ్రాబాద్‌లో సోషల్ ఆడిట్.. రూ.79,402 రికవరీ

image

అమ్రాబాద్ మండలంలో మంగళవారం 14వ రౌండ్ సోషల్ ఆడిట్ నిర్వహించారు. DRDO అదనపు అధికారి రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆడిట్ నిర్వహించగా, 20 గ్రామ పంచాయతీల్లో మొత్తం రూ.79,402 రికవరీ చేశారు. ఇందులో రూ. 75,402 రికవరీ, రూ. 4,000 పెనాల్టీగా ఉంది. ఈ కార్యక్రమంలో SIM అజీమ్, విజిలెన్స్ నజీర్ రాజు, APO శ్రీనివాసులు, AO జంగయ్య, TA, PS తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

HYD: ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి: కమిషనర్

image

HYD సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (H-CITY) స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్(SNDP) పనులను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పెండింగ్ పనులపై ఇంజినీర్లు ఫోకస్ పెట్టాలని సూచించారు.

News September 18, 2025

HYD: నీటి నాణ్యత పరీక్షలపై జలమండలి ఫోకస్

image

జీహెచ్ఎంసీ నుంచి ORR వ్యాప్తంగా నల్లా నీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే క్లోరినేషన్ ప్రక్రియ, పంపింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని పరిశీలిస్తోంది. అనేకచోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లోరిన్ బిల్లల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెలకు లక్షకుపైగా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

News September 18, 2025

వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయం: అచ్చెన్నాయుడు

image

AP: యూరియాతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. YCP నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కుంటిసాకులతో సభకు రావట్లేదని, వైసీపీ MLAల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష నేతగానూ జగన్ పనికిరారని జనం పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం మాని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.