News April 8, 2024

అమ్రాబాద్: చెక్ పోస్టుల నిబంధనల సడలింపు

image

అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 11 వరకు అటవీ నిబంధనలను సడలించినట్లు అమ్రాబాద్ రేంజ్ అధికారి ఆదిత్య తెలిపారు. 6 నుంచి 11వ తేదీ వరకు మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు వాహనాలను అనుమతించనున్నట్లు ఆదేశాలు వచ్చాయని, రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిస్తున్నప్పటికీ ఒకేసారి కాకుండా కొన్ని వాహనాలను కలిపి పంపిస్తున్నారు.

Similar News

News September 11, 2025

జడ్చర్ల: ఎరువు విక్రయ కేంద్రాల తనిఖీ

image

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News September 11, 2025

MBNR: భారీ వర్షాలు.. SP కీలక ఆదేశాలు

image

వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు వచ్చే మూడు రోజులు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా ఉన్నందున గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు.

News September 11, 2025

MBNR: యువతకు GOOD NEWS.. అప్లై చేసుకోండి

image

యువత వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ -2025లో పాల్గొనుటకు ఈనెల 30లోపు రిజిస్టేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. కంప్యూటర్ ట్రేడ్స్‌కు 16-24లోపు ఉండాలని, ఈ పోటీలో జిల్లా, రాష్ట్ర, నేషనల్, ఇంటర్ నేషనల్ స్థాయిలో ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన అభ్యర్థులు దాదాపు 56కి పైగా నైపుణ్యాలలో పోటి పడొచ్చన్నారు. Web:https://www.skillindiadigital.gov.in.