News August 12, 2024
అయిజ: ఉద్ధృతంగా తుంగభద్ర.. నది పొంగే అవకాశం
కర్ణాటకలోని తుంగభద్ర డామ్ గేటు కొట్టుకుపోయిన కారణంగా దిగువన ఉన్న తుంగభద్ర నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామ శివారులో సోమవారం తుంగభద్రా నది నిండుకుండలా, ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరో 5 అడుగులు వరద ఉద్ధృతి కొనసాగితే నది పొంగి పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉంది. దీంతో నదీ తీర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News October 1, 2024
MBNR: DSC ఫలితాలు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇక్కడే..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో DSC 1:3 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. MBNR-243 పోస్టులకు గాను 729 అభ్యర్థులు(మెట్టుగడ్డలోని డైట్ కళాశాలలో), NGKL-285 పోస్టులు(885)(లిటిల్ ఫ్లవర్ పాఠశాల), NRPT-279 పోస్టులు(837) (MLA క్యాంప్ ఆఫీస్ సమీపంలోని ఎస్సీ హాస్టల్), GDWL-172 పోస్టులు (516)(ZPHS బాలుర స్కూల్), WNPT-152 పోస్టులు(456)(బాలికల ఉన్నత పాఠశాల) సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.
News October 1, 2024
యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్
యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.
News September 30, 2024
NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.