News April 16, 2025

అయిజ: 16 నెలలయినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు: BRSV

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ కురువ పల్లయ్య ఆరోపించారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు.

Similar News

News April 21, 2025

IPL 2025: 400+ రన్స్ చేసిన సాయి సుదర్శన్

image

గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లోనూ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. KKRతో జరుగుతున్న మ్యాచుతో అర్ధసెంచరీ చేసిన ఆయన IPL 2025లో 400కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 8 మ్యాచుల్లో వరుసగా 74, 63, 49, 5, 82, 56, 36, 52 పరుగులు చేశారు.

News April 21, 2025

తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

image

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)

News April 21, 2025

సిద్దిపేట: ప్రజావాణికి 44 దరఖాస్తులు

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 44 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!