News February 19, 2025

అయినవిల్లి : పాము కాటుకు గురైన వ్యక్తి సేఫ్

image

అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన రామకృష్ణ మంగళవారం తాచుపాము కాటుకు గురయ్యాడు. అతణ్ని గ్రామ సర్పంచ్ బుచ్చిబాబు, పంచాయతీ సభ్యుడు నరసింహమూర్తి అయినవిల్లి PHCకి తరలించారు. డాక్టర్ మంగాదేవి సిబ్బందిని సమన్వయం చేస్తూ సకాలంలో వైద్యం అందించారు. దీంతో అతనికి ప్రమాదం తప్పి, ప్రాణాలు కాపాడుకున్నారు. 

Similar News

News September 13, 2025

సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: KTR

image

TG: తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని KTR ట్వీట్ చేశారు. ‘ఈ ఉద్యమానికి నేటితో 14 ఏళ్లు నిండాయి. ఇందులో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. 2011, SEP 12న కరీంనగర్ జనగర్జనలో KCR పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అంటూ నినదించింది. నిరసన తెలిపి తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసింది’ అని పేర్కొన్నారు.

News September 13, 2025

కిలో టమాటా రూ.4

image

నిన్న, మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా రేటు ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు(D) పత్తికొండ, నంద్యాల(D) ప్యాపిలి మార్కెట్లలో కిలో రూ.4 నుంచి రూ.6 మాత్రమే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు పొలాల్లోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావటం లేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.30కి అమ్ముతున్నారు.

News September 13, 2025

అనకాపల్లిలో నేడే మెగా జాబ్ మేళా

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల హాజరవుతారన్నారు. 25 బహుళ జాతి కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి 18 నుండి 35 సంవత్సరాల లోపు గల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.