News January 25, 2025

అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు

image

అల్లూరి జిల్లా అరకులోయలో మూడు రోజులపాటు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. మారథాన్, వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్నివాల్, పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్ షో, వివిధ స్టాల్స్, ఫుడ్ స్టాల్ ఉంటాయన్నారు. ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం అన్నారు.

Similar News

News November 2, 2025

తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

image

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

కదిరిలో 30 మందిపై రౌడీ షీట్లు నమోదు

image

హత్య, హత్యాయత్నం, గంజాయి అమ్మకాలు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై కదిరి టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఆదేశాలతో 30మందిపై రౌడీషీట్లు నమోదు చేసినట్లు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. తీవ్రమైన నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురిపై PD చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు చెప్పారు.

News November 2, 2025

డిప్యూటీ సీఎం పరిగి పర్యటన వాయిదా

image

పరిగి నియోజకవర్గంలో జరగాల్సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. ముందుగా సోమవారం జరగాల్సిన ఈ పర్యటన ఇప్పుడు బుధవారానికి జరుగనుంది. పరిగి పరిధిలో 400 KV, ఆరు 33/11 KV సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేసి, నజీరాబాద్ తండాలో 220 KV సబ్‌స్టేషన్ ప్రారంభించి, రూ.8 కోట్లు విలువైన వ్యవసాయ విద్యుత్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.