News February 3, 2026
అరకు: చలి ఉత్సవాల్లో పనిచేసిన అధికారులకు ప్రశంస పత్రాలు

అరకు చలి ఉత్సవాలను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ ఉత్సవాల్లో అంకితభావంతో సేవలందించినందుకు గాను ముగింపు వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ చేతుల మీదుగా అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
Similar News
News February 12, 2026
28,636 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పోస్టల్ శాఖలో 28,636 GDS పోస్టులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఫిబ్రవరి 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 1,060, తెలంగాణలో 608 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా కేవలం టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు జీతం BPMకు రూ.18వేలు, ABPMకు రూ.16వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://indiapost.gov.in/
News February 12, 2026
NLG: మూడు చోట్ల కౌంటింగ్.. రేపు తేలనున్న భవితవ్యం

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 13న జరగనుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి 3 చోట్ల ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 478 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ నెల 13న అభ్యర్థుల భవితవ్యం తేరనున్నది.
News February 12, 2026
ఆసిఫాబాద్లో అత్యధికం.. భైంసాలో అత్యల్పం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ASF మున్సిపాలిటీలో అత్యధికంగా 77.68% ఓట్లు పోల్ కాగా, భైంసాలో అత్యల్పంగా 62.67% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. MNCL కార్పొరేషన్ పరిధిలో మొత్తం 1,81,778 మంది ఓటర్లకు గాను 1,17,982 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.


