News October 28, 2025
అరకు: నేడు, రేపు పర్యాటక ప్రదేశాలు మూసివేత

మొంథా తుఫాను ప్రభావంతో ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఐటిడిఏ పరిధిలోని పర్యాటక ప్రదేశాలను నేడు, రేపు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకులోయ మండలంలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్, గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శనిలు మూతపడ్డాయి. కావున ఇప్పటికే అరకు వచ్చిన పర్యాటకులు దీనిని గమనించాలని, అరకు వద్దామనుకున్న పర్యాటకులు తుఫాను తగ్గేవరకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు.
Similar News
News October 28, 2025
తీరాన్ని తాకిన తుఫాను.. 8-10 గం.లు జాగ్రత్త

AP: మొంథా తుఫాను కాసేపటి క్రితం <<18132869>>తీరాన్ని తాకింది<<>>. రాబోయే 8-10 గం. భారీ వర్షాలు, గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10CM-20CM వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 6-7 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందన్నారు.
News October 28, 2025
సూర్యాపేట: పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ

బాధితులకు వేగవంతంగా పోలీసు సేవలు అందించడంలో పోలీసు వాహనాలు కీలకమని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనాల నాణ్యతను, కండిషన్ను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించే వాహనాలు పూర్తి కండిషన్లో ఉండాలని, వాటిని ఎక్కువ కాలం ఉపయోగించేలా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారిని ఆదేశించారు.
News October 28, 2025
వనపర్తి: బాల్యవివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు

వనపర్తి జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ గిరిధర్తో కలిసి జిల్లా స్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


