News April 2, 2024
అరవింద్, జీవన్రెడ్డి.. దొందూ దొందే : బాజిరెడ్డి

మోపాల్ మండలం నర్సింగ్పల్లి SRS గార్డెన్లో BRS కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. MP అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… అరవింద్, జీవన్ రెడ్డి దొందూ దొందే అని విమర్శించారు. వారిద్దరు నిజామాబాద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ నుంచి MLCగా ఉన్న జీవన్రెడ్డి ఒక్కరోజైనా మోపాల్ మండల ప్రజల మంచి, చెడు అడిగారా అని ప్రశ్నించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటానన్నారు.
Similar News
News April 18, 2025
ఆర్మూర్: అపార్ట్మెంట్ పై నుంచి దూకి బాలిక సూసైడ్

ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ పై నుంచి దూకి 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి భరించలేక బుధవారం రాత్రి బాలిక అపార్ట్మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
News April 18, 2025
NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.
News April 18, 2025
NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.