News January 25, 2026

అరసవల్లి: భక్తులకు కలెక్టర్ కీలక ప్రకటన

image

అరవసల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఉత్సవాలలో భాగంగా భక్తులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. రథసప్తమి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారన్నారు. సాయంత్రం నాటికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు సుమారు 1.40లక్షలు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News February 14, 2026

మూడు పద్దులు.. మూడు రంగులు

image

గ్రే, బ్రౌన్, బ్లూ.. ఈ రంగులు ఏపీ బడ్జెట్ వేళ తారస పడుతున్నాయి. ఈ రంగుల బ్యాగుల్లో బడ్జెట్ ప్రతులను ఉంచి అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజ చేసిన తర్వాత వాటిని కేబినెట్‌లో ఆమోదించే నిమిత్తం సీఎం చంద్రబాబు, dy.సీఎం పవన్‌కు అందజేశారు. ప్రభుత్వం కొలువైన తర్వాత తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు గ్రే కలర్ బ్యాగు, తర్వాత బ్రౌన్, ఇవాళ బడ్జెట్ ప్రతులను బ్లూ కలర్ బ్యాగులో తెచ్చారు.

News February 14, 2026

సిక్కోలు ‘సిద్ధమైంది’

image

మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాకుళం జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని శ్రీముఖలింగం(ముఖలింగేశ్వర స్వామి), శ్రీకాకుళం(ఉమారుద్ర కోటేశ్వరస్వామి),రావివలస(ఎండల మల్లికార్జునస్వామి), పలాస(స్వయంభూ లింగేశ్వరస్వామి), పాతపట్నం(నీలకంటేశ్వర స్వామి) ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడనుంది. దీంతో ఆయా ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News February 14, 2026

అందాల పోటీల్లో మెరిసిన శ్రీకాకుళం యువతి

image

హైదరాబాద్ వేదికగా ఐ‌ఎల్‌ఎ‌హెచ్‌ఇ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన మేఘన మెరిసింది. సెకండ్ రన్ రప్పుగా నిలిచి సత్తా చాటింది. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు ఆమె చెప్పారు. పలువురు ఈ యువతిని అభినందించారు.