News March 3, 2025

అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సులు: ఆర్ఎం జానీ రెడ్డి

image

అరుణాచల గిరి ప్రదర్శన కోసం మార్చి 12వ తేదీ సాయంత్రం 7 గంటలకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జాని రెడ్డి తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని వివరాలకు 92980 08888 సంప్రదించాలన్నారు.

Similar News

News March 3, 2025

నల్గొండ: భర్త దాడి.. భార్య మృతి

image

భార్యపై భర్త దాడి చేయగా ఆమె మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండారు మహేశ్వరి(23)కి కేతేపల్లి మండలం బండకిందగూడెం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా, భార్యపై అనుమానంతోనే భర్త ఆమెపై ఈనెల 1న సర్వారంలో దాడి చేశాడు. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించగా ఇవాళ కన్నుమూసింది.

News March 3, 2025

నల్గొండ: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

News March 3, 2025

నకిరేకల్‌: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

నకిరేకల్‌ (M) తాటికల్లు ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో  సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ప్రభు, గుర్తుతెలియని మహిళ మృతి చెందారు. సూర్యాపేట నుంచి HYDకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు మరణంపై మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

error: Content is protected !!