News August 20, 2025
అర్కండ్ల: పొలంలో మహిళకు పాముకాటు.. ఆసుపత్రికి తరలింపు

శంకరపట్నం మం. ఆర్కండ్లకు చెందిన చెర్ల రేణుక వ్యవసాయ పనులకు వెళ్లినప్పుడు పాముకాటుకు గురయ్యారు. గమనించిన తోటి రైతులు వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమెను ద్విచక్రవాహనంపై కేశవపట్నం వైపు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మక్త గ్రామం వద్ద 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలట్ గోపికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను KNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News August 20, 2025
భీమవరం: వినాయక చవితి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

వినాయక చవితి ఉత్సవాలను పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలు నిషేధించామని, ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టం వినియోగించరాదన్నారు.
News August 20, 2025
బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలున్నాయా?

నెల రోజులు జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుందా? అనే ప్రశ్న నెలకొంది. రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లో 2/3 మెజారిటీ ఉండాలి. లోక్సభలో 543 సీట్లలో 362 సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా NDA బలం 293. ఇక రాజ్యసభలోని 245 సభ్యుల్లో 164 మంది ఒప్పుకోవాలి. అక్కడ అధికారపక్షానికి ఉన్నది 125. సొంత సంఖ్యా బలం లేక, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లు ఆమోదం ఎలా? అనేది చూడాలి.
News August 20, 2025
బెల్లంపల్లి: తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

సింగరేణి ఆధ్వర్యంలో యువతకు తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. సింగరేణి పరిసర ప్రాంతాల నిరుద్యోగులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సంస్థ ఉచిత శిక్షణ ఇవ్వనుందన్నారు. తేనెటీగల పెంపకం పట్ల శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5గంటల లోపు GMకార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు.