News September 22, 2025

అర్జీదారులతో కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న అర్జీదారులతో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి కలిసి భోజనం చేశారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల కోసం కాశిరెడ్డి నాయన సత్రం, ఓంకారం వారి ఆధ్వర్యంలో అందజేసే ఉచిత భోజన కార్యక్రమంలో అర్జీదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అర్జీదారులతో భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా విన్నారు.

Similar News

News September 22, 2025

ప్రజావాణి అర్జీలకు వెంటనే స్పందించండి: HYD కలెక్టర్

image

HYD జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధ్యక్షతన సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన 167 దరఖాస్తులను స్వీకరించారు. హౌసింగ్‌ (99), పెన్షన్స్‌ (31), రెవెన్యూ (16), ఇతర శాఖల (21) అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు శాఖల వారీగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధుల అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

News September 22, 2025

బాపట్ల: ఎస్పీ కార్యాలయానికి 65 అర్జీలు

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 65 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన వినతి పత్రాలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఆయన దగ్గరకు వెళ్లలేక ఇబ్బంది పడగా, ఆయనే వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News September 22, 2025

అనంతపురం జిల్లాకు స్కోచ్ అవార్డు

image

అనంతపురం జిల్లాలో APMIP వివిధ పథకాల ద్వారా స్కోచ్ అవార్డును దక్కించుకుంది. కాగా అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో APMIP అధికారులు కలెక్టర్ ఆనంద్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ విజయం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ, APMIP PD రఘునాథ్‌రెడ్డి, ఉద్యాన శాఖాధికారి ఉమాదేవి పాల్గొన్నారు.