News January 21, 2025

అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 302 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News February 27, 2026

మార్కాపురం జిల్లాలో అధికారి సస్పెండ్

image

మార్కాపురం జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు ఇచ్చారు. గ్రామ పంచాయతీ నిధులు అక్రమంగా దుర్వినియోగం చేశారనే అభియోగంతో డిప్యూటీ MPDO విచారణ చేపట్టారు. నివేదిక ఆధారంగా శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని MPDOని కలెక్టర్ ఆదేశించారు.

News February 27, 2026

కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు హత్య చేశారు.!

image

గాలివీడులో <<19248603>>ఈ నెల 17న జరిగిన హత్య కేసులో<<>> నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరే ఈ హత్యకు కారణమని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇతనితో పాటు నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన కుళాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాధరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 26, 2026

మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

image

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.