News April 18, 2025

అర్జీలు స్వీకరించిన హోం మంత్రి అనిత

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన మంత్రి పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Similar News

News April 19, 2025

పాలమూరు: సాహితీవేత్తలకు పుట్టినిల్లు ఆ గ్రామం..!

image

NGKL జిల్లా వంగూర్ మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామం ఉద్యమకారులు, అభ్యుదయ సాహితీవేత్తలకు పుట్టినిల్లు. 1956లో కల్వకుర్తి ప్రాంతం నుంచి వెలువడిన గడ్డిపూలు కథ సంపుటిలో కథలు రాసిన ఏడుగురు రచయితల్లో ఇద్దరు రచయితలు కోట్ల సంపత్ రావు, కోట్ల చలపతిరావు ఈ గ్రామానికి చెందిన వారే. సంపత్‌రావు 1975 ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ ఖైదీగా దాశరథి కృష్ణమాచార్య, మాకినేని బసవవున్నయ్యతో కలిసి 16నెలలు రాజమండ్రిలో జైలులో ఉన్నారు.

News April 19, 2025

మామిడి పండ్లు తింటున్నారా?

image

వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తుచ్చేది మామిడి పండ్లే. అయితే, కార్బైడ్‌‌తో మాగించిన పండ్లను తింటే అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15-20 నిమిషాలు ఉంచిన తర్వాత మంచినీటితో కడిగి, ఆపై తుడిచి తినాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు తొక్కను తినకపోవడమే బెటర్ అని చెబుతున్నారు. కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిదంటున్నారు.

News April 19, 2025

భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూ భారతి చట్టం: BHPL కలెక్టర్

image

భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూ భారతి చట్టం తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాటారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలను రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన అవగాహన కల్పించారు. భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణ లభిస్తుందని కలెక్టర్ అన్నారు.

error: Content is protected !!