News March 10, 2025

అర్జీల ప‌రిష్కారంలో జిల్లాను అగ్ర‌స్థానంలో నిల‌పాలి: కలెక్టర్

image

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప‌బ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస‌ల్ సిస్ట‌మ్‌కు వ‌చ్చే అర్జీల ప‌రిష్కార నాణ్య‌త‌లో జిల్లాను అగ్ర‌స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం విజయవాడలోని క‌లెక్ట‌రేట్లో ఆయన అధికారులతో కలిసి ప్ర‌జ‌ల నుంచి 152 అర్జీలు స్వీక‌రించారు. అధికారులు అర్జీదారునితో నేరుగా మాట్లాడి, స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేయాల‌న్నారు.

Similar News

News March 10, 2025

జడేజా ‘పుష్ప-2’ సెలబ్రేషన్

image

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్‌ను టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా రిపీట్ చేశారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం బ్యాట్‌తో వీపుపై తన పేరును చూపించిన ఆయన, అదే ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. పక్కన అల్లు అర్జున్ ఫొటో జత చేసి ‘జాతీయ ఆటగాడు అనుకుంటివా..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

News March 10, 2025

చిత్తూరు DMHO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుధారాణి జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ NCD 3.0 స్కానింగ్ క్వాలిటీగా చేయాలని అన్నారు గర్భిణీ స్త్రీలకు రక్తహీనత పరీక్షలు ఎప్పటికప్పుడు చేసి తగిన వైద్యం చెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు.

News March 10, 2025

అనకాపల్లి: సమస్యలను సత్వర పరిష్కరించాలి

image

సమస్యలను సత్వర పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు 31 ఫిర్యాదులను అందజేశారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!