News April 2, 2025

అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం: ASF కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం రేషన్ కార్డుదారులకు అందిస్తామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సూచనలు చేశారు.

Similar News

News November 6, 2025

KNR: ‘పైసలిస్తేనే పని’.. కార్మిక శాఖలో ఓపెన్ దందా..!

image

కార్మిక శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. దళారులు, అధికారులు కలిసి సామాన్యుడిని దోచుకుంటున్నారు. డెత్ క్లైమ్‌కు రూ.50,000, పెళ్లికి రూ.10,000 ముందు చెల్లిస్తేనే ఖాతాల్లో డబ్బు జమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఇందుకు ఏజెంట్లు, బ్రోకర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి KNR కార్మిక శాఖలో లేబర్ కార్డ్ నమోదు నుంచి వివాహకానుకలు, అంగవైకల్యం, డెత్ క్లైమ్ల వరకు ప్రతిపనికి ఓ RATE ఫిక్స్ అయ్యుంది.

News November 6, 2025

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: టిప్పర్ యజమాని

image

మీర్జాగూడ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని <<18186628>>టిప్పర్<<>> యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బస్సు డ్రైవర్ వేగంగా వస్తూ గుంతను తప్పించబోయి మాపైకి దూసుకొచ్చాడు. వెంటనే డ్రైవర్ ఆకాశ్ నన్ను నిద్రలో నుంచి లేపాడు. క్షణాల్లోనే బస్సు మా టిప్పర్‌ను ఢీకొట్టింది. మా డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపాడని, గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు’ అని తెలిపారు.

News November 6, 2025

రంపచోడవరం అటా.. ఇటా?

image

ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుకు సన్నద్ధమౌతున్న వేళ రంపచోడవరం సమస్య తెరపైకి వచ్చింది. నియోజకవర్గం 2 డివిజన్‌లతో మొత్తం 12 మండలాలను కలిగి ఉంది. వీరు పాడేరు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో తమను పత్యేక జిల్లాగా ప్రకటించాలని కొందరు, తూ.గో.లో కలపాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలతో పాటు ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు ఆలోచిస్తన్నట్లు సమాచారం.