News April 8, 2025
అలంపూర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అలంపూర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. స్థానికుల కథనం మేరకు.. అలంపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్న తుంగభద్ర నది వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం పడి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.
Similar News
News April 17, 2025
GNT: 2 నెలల్లో రిటైర్మెంట్.. గుండెపోటుతో టీచర్ మృతి

పిడుగురాళ్ల (M) బ్రాహ్మణపల్లి ZP స్కూల్ ఇంగ్లిష్ టీచర్ వెంకటరెడ్డి గుంటూరు DEO ఆఫీస్ వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయారు. DEO సి.వి రేణుక సత్వరమే స్పందించడంతో ఉర్దూ DI ఖాశీం, DEO ఆఫీస్ సిబ్బంది హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. తూర్పు MEO ఖుద్దూస్, APTF అధ్యక్షుడు బసవలింగారావు వెంకటరెడ్డికి నివాళులర్పించారు. ఈయన 2 నెలల్లో రిటైర్ కానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
News April 17, 2025
శ్రీకాకుళం DMHO, సీసీ సస్పెండ్

శ్రీకాకుళం డీఎంహెచ్ఓ టి. బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడో తేదీన ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2025
రాజీవ్ యువ వికాసం.. రెండు దశల్లో డబ్బులు

TG: రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పథకం మంజూరయ్యాక కొంత మొత్తం, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులకు 3-15 రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రాయితీతో రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకూ సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.