News March 19, 2025

అలంపూర్‌లో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

image

ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గత 20 రోజుల క్రితం నిప్పంటించుకున్న వ్యక్తి కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నర్సింహులు ఆత్మహత్యకు యత్నించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఓ ఫైనాన్స్ కంపెనీ వారు అతడిని వేధించారని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Similar News

News December 15, 2025

‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం

image

AP: రాష్ట్రావతరణ దినంపై కొందరు రాజకీయం చేస్తున్నారని CM CBN మండిపడ్డారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 OCT 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956 NOV 1న AP ఏర్పాటైంది. ఈ తేదీలపై కొందరు రాజకీయం చేస్తున్నారు. అందుకే శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. చెన్నైలోని ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని మెమోరియల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

News December 15, 2025

గజ్వేల్: సబ్బుబిళ్లపై సర్దార్ పటేల్ చిత్రం

image

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు సబ్బుబిళ్లపై ఆయన చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు. భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు అయిన రామరాజు మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు, నవ భారత నిర్మాత, ఉక్కు మనిషి, గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు.

News December 15, 2025

తిరుమల.. మార్చి నెల టోకెన్ల విడుదల తేదీలివే

image

⁎ మార్చి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా DEC 18న 10amకి ఆన్‌లైన్‌లో విడుదల, 20వ తేదీ 10am వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు, టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ 12pmలోగా నగదు చెల్లించాలి
⁎ 22న 10amకి కల్యాణోత్సవం, తెప్పోత్స‌వాల‌ టికెట్లు, 3pmకి వర్చువల్ సేవల కోటా రిలీజ్
⁎ 23న 10amకి అంగప్రదక్షిణ, 11amకి శ్రీవాణి ట్రస్ట్, 3pmకి వృద్ధులు, దివ్యాంగుల కోటా, 24న 10amకి ₹300 టికెట్లు, 3pmకి గదుల కోటా విడుదల