News January 26, 2025
అలంపూర్ : జోగులాంబ అమ్మవారి సేవలో హైకోర్ట్ న్యాయమూర్తి

ఐదో శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ఉభయ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు చేత తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచన మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. తదనంతరం ఆలయ క్షేత్రం స్థల పురాణం, చరిత్ర గురించి ఆలయ అర్చకులు వివరించారు.
Similar News
News October 27, 2025
బాపట్ల: అధికారులతో సమావేశమైన ప్రత్యేక అధికారి

బాపట్ల జిల్లాకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కేటాయించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన వేణుగోపాల్ రెడ్డి ఆదివారం బాపట్ల కలెక్టరేట్కు విచ్చేసి తుపాను నేపథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్, ఎస్పీ ఆయనకు వివరించారు. తుపాను ప్రభావంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
News October 27, 2025
సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించాం: నాదెండ్ల

AP: సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించిన ఏకైక పార్టీ జనసేన అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొట్టే సాయిని శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్గా ఎంపిక చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువతకు తగిన అవకాశం కల్పించాలని Dy.CM పవన్ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమని ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు.
News October 27, 2025
తిరుపతి జిల్లాలో మూడు రోజులు సెలవుల

తుఫాను నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ డా. వెంకటేశ్వర్ 3 రోజులపాటు సెలవులు ప్రకటించారు. సోమవారం నుంచి బుధవారం వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


