News March 20, 2025
అలంపూర్: శ్రీ జోగులాంబ అమ్మవారి సేవలో నిరంజన్ రెడ్డి

ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఈరోజు సాయంత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉభయ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల ద్వారా తీర్థప్రసాదం అందించి, ఆశీర్వచనం మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. తదనంతరం తుంగభద్ర నది, నవబ్రహ్మ ఆలయాలను దర్శించుకున్నారు. ఆయన వెంట దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ శేఖర్ ఆచారి ఉన్నారు.
Similar News
News November 7, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.
News November 7, 2025
భారత భూమికి ఉన్న గొప్పతనం ఇదే!

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.
News November 7, 2025
ములుగు: పాఠశాల నిర్మాణం ఆపారు.. మరి చర్యలేవి!

ఏటూరునాగారం మండలం కొమురంభీం గుత్తికోయగూడెంలో అటవీశాఖ అధికారులు పాఠశాల నిర్మాణ పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాల నిర్మాణ పనులు చేపట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు బీట్ అధికారి, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. గుత్తికోయల అభివృద్ధి కోసం కడుతున్న పాఠశాల అడ్డుకొని అటవీశాఖ అబాసుపాలవుతుంది.


