News September 4, 2025
అలాంటి లింకులపై క్లిక్ చేయొద్దు: ఎస్పీ

గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీకే పేరుతో వచ్చే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దన్నారు. వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తే వచ్చే మెసేజ్లను నమ్మవద్దన్నారు. మీ అనుమతులు లేకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు కాల్ చేయాలన్నారు.
Similar News
News September 4, 2025
ఏలూరు పాము కాటుకు గురై యువకుడి మృతి

ద్వారక తిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన అశోక్ (23) పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అశోక్ పొలం పనులు చేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. బుధవారం పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. బంధువులు అతన్ని భీమడోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News September 4, 2025
కడప: నేటి నుంచి మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్ల ప్రారంభం

జిల్లాలో ఉల్లి పంటను సాగుచేసిన రైతులు ఈ క్రాప్ చేయించుకుని ఉంటే అటువంటి వారికి ప్రభుత్వం గురువారం నుంచి ఉల్లి కొనుగోలు చేస్తుందని జేసీ ఆదితి సింగ్ గురువారం తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటా ఉల్లి ధర రూ.1200 మాత్రమే అని, కమలాపురం, మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాలలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News September 4, 2025
KNR: ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్స్ యోగా పోటీలు

అంబేడ్కర్ స్టేడియంలో ఈ నెల 6న జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సర్దార్ రవీందర్ సింగ్, నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు తెలిపారు. 8-18 సం.ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు బెర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో ఈ నెల 6న ఉ.9 గం.కు కోచ్లు వద్ద నమోదు చేసుకోవాలన్నారు. 8985275068 సంప్రదించాలన్నారు