News May 25, 2024

అలిపిరి శ్రీవారి మెట్ల వద్ద బాలుడి మిస్సింగ్

image

పచ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ కుటుంబం శనివారం శ్రీవారి దర్శనార్థం అలిపిరి కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. అలిపిరి కాలిబాట మొదలయ్యేటప్పుడు ఆ కుటుంబానికి చెందిన 6 సంవత్సరాల బాలుడు మిస్సైయాడు. దీంతో టీటీడీ విజిలెన్స్ & పోలీసు అధికారులని సంప్రదించగా వారు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Similar News

News July 8, 2025

చిత్తూరు: వారి మధ్య నలుగుతున్నది పోలీసులే!

image

మామిడి రైతుల సమస్యల చుట్టూ జిల్లా రాజకీయం తిరుగుతుంది. పరిశ్రమలు వారు రూ. 8, ప్రభుత్వం రూ. 4, మొత్తం రూ.12 ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు న్యాయం చేయడం లేదని YCP బదులిస్తుంది. ఇటీవల YS జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. నిజానికి ఇరు పార్టీల రాజకీయం నడుమ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చర్చించుకుంటున్నారు.

News July 8, 2025

జగన్ రాక.. వైసీపీ నేతలకు నోటీసులు

image

చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బంగారుపాళ్యం మార్కెట్‌లో 500 మందితోనే మామిడి రైతులను పరామర్శించాలని పోలీసులు సూచించారు. ఈనేపథ్యంలో భారీ సంఖ్యలో నాయకులు బుధవారం బంగారుపాళ్యం వెళ్లకుండా ఉండేలా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయకులలకు మంగళవారం నుంచే నోటీసులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ చేయరాదని నోటీసుల్లో పేర్కొన్నారు.

News July 8, 2025

10న చిత్తూరు జిల్లాలో PTM

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.