News July 19, 2024

అల్పపీడనం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయం పూరీ సమీపంలో తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నంలో మొదటి నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

Similar News

News February 5, 2026

చైనా అధ్యక్షుడితో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్

image

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘మిలిటరీ, ట్రేడ్, APRలో నా చైనా విజిట్‌పై చర్చించాం. చైనా ఈ సీజన్‌లో సోయాబీన్ దిగుమతులను 20M టన్నులకు, వచ్చే ఏడాది 25M టన్నులకు పెంచనుంది. విమాన ఇంజిన్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లపై పాజిటివ్‌గా ఉంది. చైనా, జిన్‌పింగ్‌తో నా వ్యక్తిగత సంబంధాలు ఎంతో బాగున్నాయి. వచ్చే మూడేళ్లలో మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు.

News February 5, 2026

జగన్.. అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకండి: అచ్చెన్నాయుడు

image

AP: జగన్ గుంటూరు పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. ‘తాడేపల్లి నుంచి గుంటూరుకు ప్రయాణం 9 గంటల పాటు సాగదీయడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇలా మీరు రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించాలని చూడటం సరికాదు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రోడ్లపై డ్రామాలు ఆపి ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి. దమ్ముంటే సభలో చర్చిద్దాం. ఇకనైనా అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకాలి’ అని సూచించారు.

News February 5, 2026

T20 WC: భారత్ ఘన విజయం

image

T20 WC వార్మప్‌ మ్యాచ్‌లో SAపై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (20 బాల్స్‌లో 53), తిలక్ వర్మ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30) చివర్లో మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.