News October 12, 2024
అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు: శ్రీకాకుళం ఎస్పీ
విజయదశమి సందర్భంగా గ్రామాల్లో అమ్మవారికి కొమ్మలు వేసే సమయంలో వర్గాలుగా వీడి కొట్లాటకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల వారీగా రౌడీ షీట్ నమోదైన వారు, ఆకతాయిల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయన్నారు. అలాంటివారిపై పూర్తి నిఘా పెట్టామని ఆయన వెల్లడించారు.
Similar News
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
జిల్లాలోని KGBVల్లో ఖాళీగా ఉన్న 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులకు కనీసం ఏడో తరగతి పాస్ అయి ఉండాలి. మిగతా పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత లేదు. వయస్సు 21 నుంచి 42 వరకు కాగా, కుల ప్రాతిపదికన(47), వికలాంగులకు(52) వయస్సు పొడిగింపు ఉంది. అర్హత గలవారు ఈ నెల 15లోగా ఆయా మండలాల MEO కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలి.
News October 12, 2024
శ్రీకాకుళం జిల్లాలో వీళ్ల టార్గెట్ ఒంటరి మహిళలే
ఖాళీగా ఉన్న ఇళ్లు, ఒంటరి వృద్ధులు, మహిళలే లక్ష్యంగా చేసుకుని <<14332419>>చోరీలకు<<>> పాల్పడుతున్న రాజగోపాల్, కిరణ్ తండ్రికొడుకులను శ్రీకాకుళం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ ముందుగా రెక్కీ నిర్వహించి వృద్ధులు, మహిళలు ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడతారన ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద రూ.7.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కాగా వారికి ఓ మహిళ కూడా సాయపడినట్లు తెలిపారు.
News October 11, 2024
శ్రీకాకుళం: ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని దసరా పండగ మంచి విజయానికి చిరునామాగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఆనందంగా, సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు.