News April 9, 2025

అల్లవరం: తీరంలో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు

image

అల్పపీడనం కారణంగా అల్లవరం మండల పరిధిలోని సముద్ర తీర గ్రామాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. రెండు రోజుల నుంచి అలల ప్రభావం తీవ్రంగా ఉందని స్థానిక మత్స్యకారులు మంగళవారం తెలిపారు. ఓడలరేవు, నక్కా రామేశ్వరం, కొమరగిరిపట్నం గ్రామాల్లో అలల తీవ్రత అధికంగా ఉంది. అలల ప్రభావంతో సముద్ర తీరంలో నది కోత తీవ్రమైందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్పపీడనం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.

Similar News

News September 15, 2025

లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

image

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లయింది.

News September 15, 2025

భద్రాద్రి: రైతు వేదికనా.. బర్లకు వేదికనా..?

image

ఆల్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక గేదెలకు నిలయంగా మారింది. సంబంధిత అధికారుల నిర్వహణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రైతు వేదిక చుట్టూ ఉన్న ఫెన్సింగ్ సరిగా లేకపోవడంతో గేదెలు లోపలికి చొరబడుతున్నాయి. దీంతో అవి అందులో నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయి. అటుగా వెళ్తున్న రైతులు ఈ దృశ్యాన్ని చూసి ‘ఇది రైతు వేదికనా.. బర్ల వేదికనా?’ అంటూ నవ్వుకుంటున్నారు. నిర్వహణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

News September 15, 2025

40 ఫిర్యాదులను స్వీకరించిన ఆదిలాబాద్ ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజల రక్షణ భద్రతకు ఎల్లవేళలా ముందుంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం డీపీఓ ఆఫీస్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా స్పందించి వెంటనే ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలించారు. సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 40 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.