News September 12, 2025

అల్లీపూర్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సీఈఓ గౌతమ్ తనిఖీ

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ ఎంజేపీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం మండల స్పెషల్ ఆఫీసర్/సీఈఓ బి.గౌతమ్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంట గది పరిశుభ్రత కాపాడుతూ రిజిస్టర్లను సమయానుసారం అప్‌డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, పీఆర్ ఏఈ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Similar News

News September 12, 2025

PHOTOS: వే2న్యూస్ కాన్‌క్లేవ్-2025

image

AP: నేడు మంగళగిరిలో నిర్వహించిన Way2News కాన్‌క్లేవ్-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడులు, మెడికల్ కాలేజీలు ఇలా అనేక అంశాలపై తన విజన్‌ను వివరించారు. అటు వైసీపీ నుంచి సజ్జల, బుగ్గన తమ పాలనలో చేసిన పనులు, ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫొటోస్‌ను పై గ్యాలరీలో చూడొచ్చు.

News September 12, 2025

‘సిరిసిల్లలో రేపు లోకాదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

సిరిసిల్లలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్‌పర్సన్, న్యాయమూర్తి పి.నీరజ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉ.10.30 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు వారి సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

News September 12, 2025

వరంగల్: బియ్యం నిల్వపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

image

ఏనుమాముల బియ్యం నిల్వ కేంద్రంలో ముక్కిన బియ్యం, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని కలిపి ఉంచిన వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన ఆమె, ఈ నిర్లక్ష్యానికి కారణమైన పౌరసరఫరాల డీఎం, ఎం.ఎల్.ఎస్. ఇన్‌ఛార్జిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.